Friday, July 17, 2009

పోతన భాగవత ప్రియులకు, పుస్తక ప్రియులకు తాజా వార్త !!

పుస్తక ప్రియులకు తాజా వార్త !! పోతన భాగవత ప్రియులకు సంతోషకరమైన వార్త !! తెలుగు భాషాభిమానుల పాలిటి కామధేను వార్త. !!

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మరి కొందరితొ కలిసి అనువదించిన తెలుగు తాత్పర్యం తొ కూడిన పోతన భాగవతాన్ని టి.టి.డి. వాళ్ళు 5 సంపుటాలుగా ప్రచురించారు. హైదరాబాదు హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో ప్రస్తుతం పుస్తక ప్రదర్శన జరుగుతున్నది. అందులో భాగం గా సరసమైన ధరకే లభిస్తోంది. ఆదివారం వరకే ఈ అవకాశం. పద్యాలు+తాత్పర్యమూ ఉన్న ఈ పుస్తకం ధర 500 రూ.మాత్రమే.
ఔత్సాహికులకు సువర్ణావకాశం వినియోగించుకోగలరు.

4 comments:

రవి said...

మా ఊళ్ళో దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.ధన్యవాదాలండి.

రమణ / Ramana said...

చాలా మంచి వార్త చెప్పారు. థాంక్స్. రెండు సంవత్సరాలుగా ఈ కాపీ కానీ ఎక్కిరాల కృష్ణమాచార్యగారు తాత్పర్యం రాసిన కాపీ కానీ దొరుకుందా అని వెతికుతూ వున్నాను. థాంక్స్.

జ్యోతి said...

దన్యవాదాలు.. మాఇంటిదగ్గరే . రేపే వెళ్లి కొనుక్కుంటాను.మంచి సమాచారమిచ్చారు..

Sanath Sripathi said...

కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రాసిన భాగవత రహస్య ప్రకాశం (పద్యమూ, టీక, తాత్పర్యము తో కూడిన రహస్య ప్రకాశ వివరణతో) అత్యంత రమణీయం గా పునర్ముద్రణం జరిగి ఇప్పుడు వివిధ 'జగద్గురు పీఠం ' శాఖలలో లభిస్తున్నాయి. ఈ క్రిందివారికి టపా ద్వారా, లేదా ఫోను ద్వార సంప్రదించి భాగవతం సెట్ పొందవచ్చు.

హైదరాబాదు --> సనత్ కుమార్ --> 9908611411
బెంగుళూరు --> మురళి మోహన్--> 9902009700
విశాఖపట్నం --> శ్రీ కె.శివ శంకర్ గారు --> 9912899266
విజయవాడ --> శ్రీ వి.ఎస్. కృష్ణమూర్తి గారు--> 99893 11846
గుంటూరు --> శ్రీ జి. ఎల్.ఎన్. శాస్త్రి గారు --> 92474 15934
రాజమండ్రి --> శ్రీ. ఎన్.ఎస్. శర్మ గారు --> 94406 87509
మంగళగిరి --> శ్రీ ఆర్.టి. రామారావు గారు --> 9848632658
మైసూరు -->శ్రీ ఎం.ఎస్. గణేష్ గారు --> 93417 75225
చెన్నై --> శ్రీ రాంప్రసాద్ జోషి గారు --> 9003020654
బళ్ళారి --> శ్రీ. జె.ఎన్.మూర్తి గారు --> 97402 77255